SAKSHITHA NEWS

జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్, స్థానిక ఖిల్లాలోని జాఫర్ బావిని సందర్శించారు. జాఫర్ బావి పునరుద్ధరణ లో నాటి ఆనవాళ్లు స్పూరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బావి వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలని తొలగించి, ఆ రోజుల్లో వాడే మాదిరి పాత స్తంభాలని ఏర్పాటు చేయాలన్నారు. సెక్యూరిటీ గదిని తొలగించాలన్నారు. ప్రతి పనిలో ఖిల్లా లుక్ వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, హెరిటేజ్ మ్యాటర్స్ సంస్థ ప్రతినిధులు రాజశ్రీ, వాత్సల్య, లితేష్, అధికారులు తదితరులు ఉన్నారు.
WhatsApp Image 2024 08 20 at 19.04.56

SAKSHITHA NEWS