భారత్కు సురక్షితంగా చేరుకున్న భారత స్టార్ షట్లర్ P. V. Sindhu
ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల పాటు Dubai లో నిలిచిపోయిన సింధు,తాజాగా స్వదేశానికి చేరుకుని తాను సురక్షితంగా ఉన్నానని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
“మొదట విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత భవిష్యత్ టోర్నమెంట్లపై దృష్టి పెడతాను” అని సింధు పేర్కొన్నారు.
ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం క్రీడాకారుల ప్రయాణాలపైనా పడిన నేపథ్యంలో,సింధు సురక్షితంగా తిరిగి రావడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. 🇮🇳
దేశ గర్వంగా నిలిచిన సింధుకు ఆరోగ్యం, విజయాలు ఎల్లప్పుడూ కలగాలని ఆకాంక్షిస్తూ…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
