SAKSHITHA NEWS

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీపై బాధితురాలి తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో ప్రపంచం మొత్తం తన కూతురికి అండగా నిలుస్తుంటే, సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమను ఆమె కామెంట్స్ మరింత బాధించాయని వాపోయారు. మమతకు పిల్లలు లేరు కాబట్టి వారిని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆమెకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS