SAKSHITHA NEWS

ప్రతి ఒక్క హజ్ యాత్రికుడు ఈ వైద్య శిబిర అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * *


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా, లాటరీలో ఎన్నుకోబడిన, రంగారెడ్డి జిల్లా పరిసర హజ్ యాత్ర చేయు భక్తులకు, కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ నందు, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ , సయ్యద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ , హజ్ కమిటీ మెంబర్ సయ్యద్ నిజముద్దీన్ , DMHO డా. వెంకటేశ్వరరావు , డిప్యూటీ డీఏం అండ్ హెచ్వో డా. శ్రీమతి సృజన , డీఐఓ డా. శ్రీమతి స్వర్ణ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సమాజం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అని, హజ్ యాత్ర కు వెళ్లే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగినది అని, హజ్ యాత్ర చేయు భక్తులకు కోసం ఈ యొక్క వైద్య శిబిరం కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ నందు మూడు రోజుల పాటు కొనసాగుతుందని , ఈ చక్కటి సదవకాశం ను సద్వినియోగపర్చుకోవలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఈ రోజు జరిగిన వైద్య శిబిరంలో 50 మంది వరకు హజ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వారందరికీ కూడా హజ్ యాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ,క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో
కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ డా. మూర్తి, కొండాపూర్ డివిజన్ బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, బుడుగు తిరుపతి రెడ్డి,తిరుపతి యాదవ్, రజనీకాంత్, మంగళరాపు తిరుపతి పటేల్ ,గణపతి, కచ్చావా దీపక్, హనుమంతు రెడ్డి, ఇసుక రమేష్, డా. మల్లేష్, అవదీష్ నారాయణ, రాజు, షేక్ రఫీ, నరసింహ రెడ్డి, ఈరన్న, నాగరాజు, మహమ్మద్ మరియు హజ్ యాత్రికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS