SAKSHITHA NEWS

యువత చూపు బీఆర్ ఎస్ వైపు

గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ *

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ కి చెందిన 100 మంది నాయకులు,కార్యకర్తలు, యువకులు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరీ గారి ఆధ్వర్యంలో గౌరవ కార్పొరేటర్లు శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గార్ల సమక్షంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి నివాసంలో వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెక పూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారు మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.ఈ రోజు బీజేపీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున యువత, నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో, వారి సూచనలు,సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, మియాపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ గారు తెలియచేశారు.. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిదంగా గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారిదేనని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియజేసారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు,కట్ల శ్రీనివాస్, తిరుపతి మరియు

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులు లోకేష్ కుమార్,కిరణ్,సంతోష్,వెంకట చారీ, వంశీ కృష్ణ,పవన్, భాస్కర్ సాయి, వినోద్ కుమార్,అజయ్, ముర్గేష్, శివ,అజాం, శేఖర్,నారాయణ, గోపాల్, రాజు, మాచర్ల, సాగర్,అనిల్ సాయి, లక్ష్మణ్ ,అనిల్ యాదవ్, నితిన్,వినయ్, మణి, భరత్, మీర్జా,రాకేష్ తదితరులు పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగినది.


SAKSHITHA NEWS