SAKSHITHA NEWS

హన్మంతన్న భరోసా||

సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17 డివిజన్ కౌసల్య కాలనీ కమిటీ వాసులు సి . సి రోడ్స్ మరియు ఇతర అభివృద్ధి నిధుల కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చి విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలోనే వారి సమస్యలను పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17 డివిజన్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, హరీష్ రెడ్డి, ప్రసాద్ రావు, లింగ రెడ్డి, పద్మ రావు, నాగేశ్వర్ రెడ్డి, గొల్ల కృష్ణ మరియు ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS