SAKSHITHA NEWS

రాయ్‌పూర్‌:
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమ య్యారు..

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాల కు, మావోయిస్టులకు మధ్య ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకు న్నాయి..

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారస పడినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో కాల్పులు చోటుచేసు కున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమై నట్లు వెల్లడించారు.

కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగు తోందన్నారు..


SAKSHITHA NEWS