SAKSHITHA NEWS

*ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు అయిన 21,34,000/- ఇరవై ఒక లక్ష ముపై నాలుగు వేల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 50 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన 21,34,000/- ఇరవై ఒక లక్ష ముపై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. PAC చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలోనాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్ , చిన్నోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి,ప్రసాద్ ,రమణారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS