SAKSHITHA NEWS

టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
టెన్త్ క్లాస్‌లో 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌లో మార్పులు జరగడం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తుండటంతో ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దాంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.


SAKSHITHA NEWS