నూతన తహసీల్దారుగా ఘంట ప్రతాప్ బాధ్యతలు స్వీకరణ
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం నూతన తహసీల్దారుగా ఘంట ప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమై మండలంలోని ప్రజా సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఘంట ప్రతాప్ కు కార్యాలయ సిబ్బంది పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
