మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు..
షాపూర్ లోని నివాసంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని నూతనంగా ఏర్పాటైన కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (గాజులరామారం) వారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు, అనంతరం వారి కాలనీలో ఉన్న సమస్యలను కొన్నింటిని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, దీనిపై వారు సానుకూలంగా స్పందించారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చి రెడ్డి , కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి ఉపాధ్యక్షుడు యాకూబ్ అలి, వీరేందర్, వేణుగోపాలరావు, రవికుమార్, వెంకటేష్, మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
