SAKSHITHA NEWS

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..
స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి*


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, జగద్గిరిగుట్ట మరియు గాజులరామారం డివిజన్లలోని పలు ఆలయాలు మరియు కాలనీలలో శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ * హాజరై, సీతారాముల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఆదర్శమూర్తి శ్రీరాముని జీవన విధానం నుండి తరతరాలుగా ప్రజలు ప్రేరణ పొందుతున్నారని అన్నారు. ఆ సీతారాముల అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక బిజెపి నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS