నూతన సర్పంచు విజేతలకు శుభాకాంక్షలు, ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
సాక్షిత వనపర్తి
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన బి.ఆర్.ఎస్ 34మంది సర్పంచులను మరియు వార్డు సభ్యులను ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అధికార పార్టీ అరాచకాలకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికలలో ప్రస్పుటించిందని రాబోయేది బి.ఆర్.ఎస్ ప్రభుత్వము అని స్పష్టమైందని అన్నారు.
గెలిచిన సర్పంచులు కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు.
రాబోవు ప్రభుత్వంలో అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

