SAKSHITHA NEWS

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన…

ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

*ఖమ్మం ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వేముల రవి కుమారుడు పవన్ వివాహ మహోత్సవానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు.

*ఇటీవల మరణించిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అప్జల్ కుటుంబాన్ని పరామర్శించి అప్జల్ కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.

*కార్పొరేటర్ ముక్కాల కమల కుమారుడు రాజేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి ఇంటికి వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

*టేకులపల్లికి చెందిన దొంగల నాగేశ్వరావు ఇటీవల మరణించగా వారి దశదిన హాజరై వారికీ నివాళులు అర్పించారు.

*ప్రకాష్ నగర్ కు చెందిన వేముల సాయికుమార్ (29)ఇటీవల మరణించగా సాయికుమార్ కు నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.వారి కుటుంబాన్ని ఓదార్చి దైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మండల అధ్యక్షులు వీరు నాయక్,బచ్చు విజయ్ కుమార్,దేవభక్తుని కిషోర్,డౌలే సాయి కిరణ్,గుత్తా రవి,పిన్ని కోటేశ్వరరావు,దొంతు సత్యనారాయణ,లక్ష్మణ్ నాయక్,తారాచంద్,శ్రీను,దడాల రఘు,తోట వీరభద్రం,దొంగల తిరుపతి రావు,పాపారావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS