SAKSHITHA NEWS

లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమం ….

సాక్షిత ధర్మపురి ప్రతినిధి : ఈ కార్యక్రమములో స్థానిక SI ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ )ఉమాసాగర్ మాట్లాడుతూ…
పర్యావరణ సహిత మట్టి గణపతులనే పూజించండి –
ఈ వినాయక చవితి పండుగను ప్రకృతికి, పర్యావరణానికి హాని కలుగని విదంగా మట్టి గణపతులను పూజిస్తూ జరుపుకోవాలని ప్రజలను కోరారు మట్టి గణపతి విగ్రహాల పంపిణి కార్యక్రమం లో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని ఇలాంటి గొప్ప పండుగను ప్రకృతికి, పర్యావరణానికి హాని కలుగని విదంగా జరుపుకోవడం ద్వారా మానవసమాజానికి, భవిష్యత్ తరాలకు మేలు చేసినవారం అవుతామణి అన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ అధ్యక్షులు లయన్ సిరిపురం తిరుపతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత మట్టిగణపతులను పంచుతున్నామని ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ అధ్యక్షులు లయన్ సిరిపురం తిరుపతి గారు, సెక్రటరీ నోముల వెంకట్రెడ్డి , ట్రెజరర్ గదాసు రాజేందర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS