SAKSHITHA NEWS

పడవాడ నెహ్రూ ఫార్మసిటీలో ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యం.

  • సాక్షిత : కంపెనీ లోపలికి వెళ్ళిన ఉద్యోగి తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన.
  • పోలీసులకు ఫిర్యాదు.
  • కర్మాగారం ఎదుట ఉద్యోగి కోసం ఆందోళన.

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న ఎగ్ అడ్మిరం లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ (40) ప్రొడక్షన్ మేనేజర్ మంగళవారం ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్లారు. కంపెనీ బయోమెట్రిక్ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్టుగా నమోదయింది. విధులు ముగించుకొని బయటకు వచ్చే హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్ద ఉండటంతో ఉద్యోగ కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కర్మకారం ఎదుట బైఠాయించారు. కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు? కంపెనీలో హాజర పట్టికలో ఇన్ అని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాజమాన్యం కూడా ఉద్యోగ అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…


SAKSHITHA NEWS