SAKSHITHA NEWS

ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన

ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన
త్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్‌ఫ్లూయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


SAKSHITHA NEWS