SAKSHITHA NEWS

తిరువూరు,గానుగపాడు

ప్రపంచంలో మాట్లాడేభాషల్లో ఆంగ్లందే అగ్రస్థానమని,అరు నెలలు గట్టిగా శ్రమిస్తే ఆంగ్లంపై పట్టు సంపాదించవచ్చని ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్ యం.రాం ప్రదీప్ తెలిపారు.

\ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,గానుగపాడు,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, తిరువూరులలో పది విద్యార్థులకు నిర్వహించిన ఆంగ్లంపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏదైనా ఇతర భాష నేర్చుకునే క్రమంలో తప్పులు దొర్లడం సహజమని,భయం లేకుండా మాట్లాడితేనే ఆంగ్ల భాష పై పట్టు వస్తుందని తెలిపారు. అనంతరం పదవ తరగతిలో ఇంగ్లీష్ పరీక్ష రాసే విధానాన్ని వివరించారు. సంఘ ప్రతినిధులు జయ శ్రీ,పద్మావతి,శారద భాను,మోహన్ తదతరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS