SAKSHITHA NEWS

మట్టి గణపతుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీర్ బి రాజేందర్ మరియు సహాయక శాస్త్రవేత్త బి లింగయ్య ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో పలుచోట్ల మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్, జీడిమెట్ల డిపో తదితర ప్రాంతాలలో మట్టి గణపతి లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా పిసిబి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీ విజయ దుర్గ దేవాలయం, వాసుదేవాశ్రమం, దయానందనగర్ నిఖిల తంత్ర మైత్రేయ ఆశ్రమాల వద్ద మట్టి విగ్రహాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు.

ఈ పంపిణీలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యస్వామి, శ్రీధరాచార్యులు, జనమంచి శశికుమార్, హరి రాఘవేంద్ర, మిర్యాలమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS