SAKSHITHA NEWS

విశాఖలో డాక్టర్ సుధాకర్, కడపలో డాక్టర్ అచ్చన్న ప్రాణాలు పోతే.. దళిత మంత్రిగా ఉండి కనీసం మీరు స్పందించలేదు

ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడైన తన కారు డ్రైవర్ను చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే మీకు కనపడదు

దళితులపై జరుగుతున్న హత్యాకాండ, దాడులు, అరాచకాల గురించి ఒక్కసారైనా మీరు జగన్మోహన్ రెడ్డి ముందు చొక్కా విప్పి నిరసన తెలిపితే దళితులు శభాష్ అనేవారు

దళితులకు సమాధానం చెప్పే దమ్ము లేక కొత్త నాటకాలకు తెర తీస్తున్నారా

దళితులు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరు

నాలుగేళ్లగా దళితులకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా..

టిడిపికి ప్రజల్లో వస్తున్న స్పందన చూసి వైసిపి నేతలు బెంబేలెత్తిపోతున్నారు

నెల్లూరు పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్

కందుకూరు-
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితులపై ఎన్నో అరాచకాలు, ఆకృత్యాలు, దాడులు, హత్యలు జరుగుతుంటే ఏ
నాడు స్పందించని మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఎర్రగొండపాలెం లో చంద్రబాబు నాయుడు పర్యటనలో చొక్కా విప్పి హడావిడి చేయడమే గాక, తన అనుచరుల చేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి చేయించడం చూస్తుంటే.. టిడిపిని చూసి వైసిపి నేతలు ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతుందని నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారి అయినా మంత్రి సురేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చొక్కా విప్పి నిరసన తెలిపి ఉంటే కొంతవరకైనా దళితులపై దాడులు ఆగి ఉండేవన్నారు. కరోనా సమయంలో మాస్కు అడిగిన పాపానికి విశాఖపట్నంలో దళితుడైన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం పిచ్చివాడిని చేసి, చనిపోయేలా చేసిందని, కడపలో డాక్టర్ అచ్చన్న హత్యకు గురైతే ఏమీ పట్టనట్లు వ్యవహరించిందని, ఇవి మంత్రి ఆదిమూలపు సురేష్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు.

టిడిపి ప్రభుత్వం దళితులకు 27 సంక్షేమ పథకాలు అమలు చేసిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలను తీసివేసిందని, ఏనాడైనా మంత్రి సురేష్ వీటి గురించి మాట్లాడలేదన్నారు. దళితులకు మాత్రమే ఖర్చు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నాలుగేళ్లుగా పక్క దారి పట్టిస్తుంటే, మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు దళిత విద్యార్థులను విదేశాల్లో చదివించేందుకు అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం కింద వేల మందికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఇచ్చారని, నాలుగేళ్లలో ఒక్కరికైనా వైసిపి ప్రభుత్వం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పైగా నాలుగేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ విద్యా నిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి సురేష్ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

వైసీపీకే చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడైన తన కారు డ్రైవర్ను చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే మంత్రి సురేష్ ఒక్క మాటైనా మాట్లాడలేదన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై నాలుగేళ్లుగా చంద్రబాబు పోరాడుతూనే ఉన్నారని, ఇది సహించలేకనే మంత్రి సురేష్ ఎర్రగొండపాలెం లో పిచ్చి వేషాలు వేశారన్నారు. చంద్రబాబు ముందు చొక్కా విప్పటం కాదని, దళితులకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చొక్కా విప్పితే దళితులే మంత్రి సురేష్ కు సన్మానాలు చేసి అభినందిస్తారని తెలిపారు. అలా చేయడం చేతకాకనే తన స్వార్ధం కోసం, మళ్లీ టిక్కెట్టు ఇస్తారో, లేదోనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మంత్రి సురేష్ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని, దళితులందరూ ఆయన వేస్తున్న వేషాలను గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నాడని, ఇంకా ఏడాది సమయం ఉందని దళితుల సమస్యలపై చేతనైతే ఇప్పటికైనా ముఖ్యమంత్రిని ప్రశ్నించాలన్నారు. లేకపోతే దళితులే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించి రాజకీయంగా సమాధి కడతారని హెచ్చరించారు. చంద్రబాబు భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఎర్రగొండపాలెం ఘటనకు కారకుడైన మంత్రి సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS