శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్న దారపనేని, రాయవరపు, పెండ్యాల
సాక్షిత కనిగిరి ::నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో రెండవ శ్రావణ , నారసింహ వ్రతం సందర్భాన్ని పురస్కరించుకొని రాయవరపు వెంకటరత్నం, లక్ష్మీదేవి దంపతులు వారి మనవడు శివాన్ష్ జన్మదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిపించారు. ఈ అభిషేకం కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, దేవస్థానం ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ దంపతులు పాల్గొని స్వామివారి అభిషేకం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అభిషేకం కార్యక్రమంలో కాకొల్లు వారి పల్లె గ్రామస్తులు, కాకొల్లు గణేశ్వర రావు, గడిపూటి మురళి, దుగ్గినేని రామయ్య, శింగమనేని రవి దంపతులు, కాకొల్లు అంకయ్య దంపతులు, రాయవరపు వెంగమ్మ, వరమ్మ కాకొల్లు విజయ, పువ్వాడి జయమ్మ, శారద, మన్నెం విశ్వనాధ్, వేమూరి సురేష్ దంపతులు, దుగ్గినేని విజయ, శ్యామల, పులివర్తి శ్రీ లక్ష్మీ నారాయణమ్మ, మిరియం సుబ్బరాయుడు (ఎమ్మెస్సార్ చౌదరి) గురువయ్య, మట్లే రాహుల్ యాదవ్, యర సింగ్ రాయడు స్వామివారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
