SAKSHITHA NEWS

కనిగిరి

సాక్షిత న్యూస్…..ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారము సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, వగ్గంపల్లి సర్పంచ్ దేవన బోయిన నాగార్జున ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి పట్టు వస్త్రం బహుకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం వలన సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని , స్వామివారి భక్తులు దేశం నలుమూలల నుండి స్వామివారి దర్శనార్థం విచ్చేస్తారని స్వామివారిని దర్శించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దారపనేని, బైరెడ్డి పేర్కొన్నారు.


SAKSHITHA NEWS