SAKSHITHA NEWS

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన క్రికెటర్ దీప్తి శర్మ!

హైదరాబాద్:
ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదా బాద్‌లో నియామకం. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ క్రీడ ల్లో భారతదేశానికి చేసిన సేవలకుగాను ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితు లయ్యారు.

దీంతో డీఎస్పీగా బాధ్య తలు చేపట్టిన రెండో భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలి చింది. కొద్ది రోజుల క్రితమే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణలో డీఎస్పీగా నియమితులైన సంగతి తెలిసిందే.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన కృషికి జనవరి 27న ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదా బాద్ జిల్లా లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితుల య్యారు.

తనకు కల్పించిన గౌరవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. దీప్తి శర్మ ఖాకీ యూనిఫాం ధరించిన కొన్ని చిత్రాలను పంచుకుంటూ, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పోటోలను షేర్ చేస్తూ.. “ఈ గొప్ప మైలురాయిని సాధిం చినందుకు హృదయపూ ర్వక కృతజ్ఞతలు. తెలిపారు.

వారి మద్దతు, ఆశీర్వా దాలు నాకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. ఈ అవకాసాన్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ తెలిపింది.

ఉత్తర ప్రదేశ్ పోలీస్‌లో డీఎస్పీగా ఈ కొత్త బాధ్యతను స్వీకరిస్తూ.. నా విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ, నిజాయితీతో సేవ చేయడానికి పూర్తిగా అంకితం అవుతానని రాసుకొచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app