SAKSHITHA NEWS

ఎల్గూరి యాదమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డ్ రాయినిగూడెం లో మాజీ ఉపసర్పంచ్ ఎల్గూరి యాదమ్మ దశదిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎల్గూరి యాదమ్మ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎల్గూరి వెంకటేశం గౌడ్, ఎల్గూరి వీరే గౌడ్,ఎలగబోయిన మధు యాదవ్, జంగిల్ సైదులు యాదవ్, ఎడ్ల ఉపేందర్ యాదవ్, షేక్ మదర్ హుస్సేన్, బొడ్డు సైదులు, స్పందనమైన సైదులు, తదితరులు హాజరయ్యారు.


SAKSHITHA NEWS