భారీ అక్రమాలు..? వి9 సంస్థపై డీజీఎంఎస్, సింగరేణి సీఎండీకి ఫిర్యాద
ఓసీపీ-3లో ఓబీ తరలింపులో రూ.15–20 కోట్ల మేర సంస్థకు నష్టం జరిగిందని ఆరోపణలు…
సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ డిమాండ్…
సాక్షిత : పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి, రామగుండం రామగుండం ఏరియా–2 పరిధిలోని ఓసీపీ–3 గనిలో ఓబీ (ఓవర్బర్డెన్) మట్టి తరలింపు పనుల్లో వి9 కాంట్రాక్ట్ సంస్థ భారీ అక్రమాలకు పాల్పడుతోందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు. ఈ అంశంపై డీజీఎంఎస్, సింగరేణి సీఎండీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఆయన వివరాల ప్రకారం, ఓసీపీ–3 ఫేజ్–2లో లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టిని టెండర్ నిబంధనల ప్రకారం 4.5 కిలోమీటర్ల దూరంలోని ఎక్స్టర్నల్ డంప్యార్…

