SAKSHITHA NEWS

బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావు
ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి. పాపారావు బుధవారం బాధ్యతలు చేపట్టారు.ఈనెల తొమ్మిదో తారీఖున పలువురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాంబాబు ను గుంటూరు రేంజ్ కార్యాలయం కు పంపడంతో ఆ స్థానంలో పాపారావు ను నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావుకు ఎస్సై వెంకట సైదులు పలువురు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.


SAKSHITHA NEWS