SAKSHITHA NEWS

బంద్‌ ఎఫెక్ట్.. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయిన బస్సులు

బంద్‌ ఎఫెక్ట్.. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయిన బస్సులు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భారత్ బంద్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.


SAKSHITHA NEWS