SAKSHITHA NEWS

సూరారం కాలనీ , రాజీవ్ గృహకల్పల నుంచి బస్సు సర్వీసులను పెంచాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి వినతిపత్రం…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో “వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజబుల్డ్” సభ్యులు ఎమ్మెల్యే కెపివివేకానంద్ ని కలిసి సూరారంకాలనీ , రాజీవ్ గృహకల్పల నుంచి సికింద్రాబాద్, బాలానగర్ ప్రాంతాలకు బస్సు సర్వీసులను పునః ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా “వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజబుల్డ్” సభ్యులు మాట్లాడుతూ కరోనాకు ముందు సూరారం కాలనీ నుంచి సికింద్రాబాద్ వరకు 20 బస్సు సర్వీసులు నడిపే వారని, కరోనా తర్వాత కేవలం సూరారం కాలనీ నుంచి ఆరు బస్సు సర్వీసులను మాత్రమే నడిపిస్తున్నారని, దీనితో సూరారం కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర అవస్తలు పడుతున్నారన్నారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడుతూ సూరారం కాలనీ నుంచి గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జి.అంజయ్య గౌడ్, జనరల్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి, సభ్యులు సత్యం, యు.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS