SAKSHITHA NEWS

యుద్ధప్రాతిపదికన పాలేరు కాలువ గండి పూడ్చివేత
మంత్రి పొంగులేటి చొరవతో తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడి*- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పదిహేను రోజుల్లోపే పాలేరు ఎడమ కాలువ మరమ్మత్తులను తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మత్తులకు ఆదేశించటమే కాకుండా ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించి నాగార్జున ప్రాజెక్టు పరిధిలోని 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందేలా మంత్రి చర్యలు చేపట్టారు. రెండు వారాల్లోపే గండి పూడ్చివేసి పంటలకు సాగునీటిని విడుదల చేయటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.


SAKSHITHA NEWS