SAKSHITHA NEWS

Bomb threats to museums in Delhi

దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్‌ అని భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.


SAKSHITHA NEWS