SAKSHITHA NEWS

గణేష్ మండపాలకు బియ్యం పంపిణీ చేస్తున్న బిజెపి నాయకులు…

సాక్షిత : గణేష్ మండపాలలో గణేష్ నవరాత్రిని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు…

అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం… స్థానిక బిజెపి నాయకులు జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ , బిజెపి సీనియర్ నాయకులు భాను ప్రకాష్ సూచన మేరకు మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన మండపాలలో అన్న ప్రసాద వితరణ కోసం 50 కిలోల బిర్యానీ ఇతర సామాగ్రిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు…

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ… గణేష్ మండపాలలో నిర్వహిస్తున్న అన్నదానం కోసం 50 కిలోల బియ్యంతో పాటు ఇతర సామాగ్రిని అందిస్తున్నామని ఇప్పటి వరకు వరకు దాదాపుగా వంద మండపాలకు పైగా అందించడం జరిగిందని… మండపానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న కానీ మరే విషయంలో కానీ ఇబ్బందులు ఏర్పడినట్లయితే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు…


SAKSHITHA NEWS