SAKSHITHA NEWS

మాజీ సీఎం జగన్ కు భారీ ఊరట…పాస్ పోర్టు రెన్యూవల్ పై హైకోర్టు కీలక తీర్పు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ కు భారీ ఊరట లభించింది. పాస్ పోర్టు రెన్యూవల్ పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

పాస్ పోర్టు రెన్యూవల్ పై జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. పాస్ పోర్ట్ కు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు.

విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టు ఆదేశాలు ప్రకారం 20 వేల పూచీకత్తు సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది.

ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్ పోర్ట్ రెన్యువల్ ఐదేళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. దీంతో… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ కు భారీ ఊరట లభించింది.


SAKSHITHA NEWS