SAKSHITHA NEWS

BHIMAVARAM భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావాలి… జనసేన సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం నియోజకవర్గoలో అత్యధికంగా జనసేనపార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యేలా జనసైనికులు, వీర మహిళలు కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజ
నేయులు( అంజిబాబు) పిలుపు నిచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన పార్టీ మెంబర్షిప్ వాలంటీర్స్ సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నూరు శాతం రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి కుళాయి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. జనసేన పార్టీలో 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యులుగా చేరితే
5 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని చెప్పారు. గాయపడిన వారికి వైద్య ఖర్చుల

Bhimavaram

SAKSHITHA NEWS