SAKSHITHA NEWS

Pawan Kalyan: అప్రమత్తంగా ఉండండి.. జనసైనికులకు పవన్‌ బహిరంగలేఖ

అమరావతి: జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. మాట్లాడేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు..

ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులను ఆయన బహిరంగ లేఖ రాశారు.

కుట్రలకు పాల్పడుతున్నట్లు సమాచారం..

”ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించేందుకు, భావజాలాన్ని కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని శ్రేణులకు చేర్చి కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. వాటిని మనం అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది..

ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లండి. వారి సూచనలు, సలహా మేరకు మాట్లాడండి. పార్టీలోని నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి


SAKSHITHA NEWS