SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల పట్టణ కేంద్రం లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గ సెంటర్ లో ఉన్న జగ్జీవన్ విగ్రహానికి బిజెపి పట్టణ అధ్యక్షులు కూరెల్ల శ్రీను పూలమాలలు నివాళుర్పించారు.

అనంతరం కూరెల్ల శ్రీను మాట్లాడుతూ బాబు జగ్జీవన్ దేశానికి ప్రధాని కావలసిన వ్యక్తి అని నవ భారత నిర్మాణం కోసం అనేక కష్ట సమయాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన అన్ని వర్గాలతో పాటు నిమ్న వర్గాలను జాగృతం చేసిన మహనీయుడు, గొప్ప పరిపాలనా దక్షుడు మాజీ ఉప ప్రధాని బాబూ జగన్మోహన్ రామ్ అటువంటి మహనీయుని జయంత్యుత్సవం అత్యంత ప్రామాణికమైనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ జిట్టా కృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోళ్ల స్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లేష్, దళిత మోర్చా పట్టణ ప్రధానకార్యదర్శి జిట్టా విష్ణు, అభినవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS