SAKSHITHA NEWS

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు

సాక్షిత :- పరవాడ మండల కేంద్రం పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకొను నివారణ చర్యల గురించి, రహదారి భద్రత వంటి విషయాలపై పాటించాల్సిన నియమాలను విద్యార్థులకు తెలియజేసారు.

కాలేజీ విద్యార్థులు కాలేజీకి వెళ్లునపుడు మరియు వచ్చినప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకూడదని, వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు విధిగా ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వలన కలిగే ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్ వలన కలిగే ప్రమాదాలు గురించి విద్యార్థులకు తెలియజేసారు.ఈ అవగాహన సదస్సులో సిఐ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జి.వి.నారాయణరావు, లెక్చరర్లు జి శ్రీధర్, లక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు


SAKSHITHA NEWS