సైబర్ హైజీన్ పై అవగాహన
** టెలికం కస్టమర్లకు జాగ్రత్త అవసరం
సాక్షిత ప్రతినిధి – పుత్తూరు: టెలికం వినియోగదారులకు మెరుగైన సేవలే “ట్రాయ్” లక్ష్యంగా పనిచేస్తూ…సైబర్ హైజీన్ పై అవగాహన కల్పిస్తున్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కాగ్ సభ్యులు పావులూరు చిట్టిబాబు తెలిపారు. పుత్తూరులోని డి.ఆర్.డి.ఎ సమావేశ హాలులో వినియోగదారులకు సైబర్ హైజీన్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు..ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ప్రపంచములో టెలికం కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశములో మనదేశం 2వ స్థానంలో ఉందని తెలిపారు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పథకాన్ని 2006 నుంచి నిర్వహణ చేస్తున్నట్లు చెబుతూ….ఇప్పటి వరకు 70 కోట్ల మంది వినియోగదారులు ఈ పథకాన్ని వినియోగిం చుకున్నారని పేర్కొన్నారు.
అలాగే అవాంచిత మొబైల్ కాల్స్ వినియోగదారులకు గుర్తించిందని తెలిపారు. ఇటువంటి కాల్స్ నియంత్రణ కోసం ట్రాయ్ 1909 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నంబర్ కి కంప్లైంట్ చేసినట్లయితే సదరు నంబర్ ను 2 సంవత్సరాల వరకు బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో 2025 చివరి నాటికి బ్రాడ్ బాండ్ ప్రతిఒక్కరికి ఉండేలా దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఇలాంటి సదస్సులు నిర్వహణ చేస్తూ వినియోగదారులకు సూచనలు, సలహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా వినియోగదారులకు న్యూ ప్రోగ్రామ్స్ అనుసంధానము తదితర విషయాలపై అవగాహన కల్పించారు. టెలి మార్కెటింగ్ కాల్స్ విషయంపై అడ్డుకోవడానికి “డునాట్ డిస్టర్బ్” ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ పోర్ట్ ను కూడా చేసుకోవచ్చునని తెలిపారు. సైబర్ హైజీన్ విషయంపై సంబంధిత సైబర్ డిపార్ట్మెంట్ అధికారులు వివరించారు. తెలిపారు. 1930కి కాల్ చేసి సైబర్ ఇష్యూస్ ఉన్నప్పుడు తెలియచేయాలని కోరారు. అలాగే సంచార సౌద్ అనే యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజినీర్ రమేష్ బాబు, డిఆర్డిఎ ఏపీఎం వినీత, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ అమర్, వందమందికి పైగా మహిళలు, వినియోగదారులు హాజరయ్యారు. చివరగా సంబంధిత సమాచార మెటీరియల్ ను కూడా పంపిణీ చేశారు.
