SAKSHITHA NEWS

సాక్షిత : సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె. విజయరామారావు స్వర్గస్థులైన విషయం తెలియగానే వారి స్వగృహానికి వెళ్లి విజయారామారావు పార్థివ దేహం పై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ని తెలియచేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె. విజయరామారావు మరణం పట్ల ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.
ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ స్మరించుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ మాధవరం రంగరావు , వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS