SAKSHITHA NEWS

జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ మరో కార్మికుల మృతి.

*నాలుగుకి చేరిన మృతిలు సంఖ్య

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ పరిశ్రమలోజరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. తాజాగా జార్కండ్ రాష్ట్రానికి చెందినకార్మికుడు ఓయాబన్ కొరాష్(24) ఇండస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు. ఆగస్టు 22వ తేదీ అర్ధరాత్రి సినర్జిన్ పరిశ్రమలో ప్రమాదంజరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా ఆ నలుగురుమృతి చెందారు. వీరిలో జార్కండ్ రాష్ట్రానికి చెందిన రోయన్ అంగీరియా ఆసుపత్రిలోచికిత్స పొందుతూ గత నెల 24వ తేదీ తెల్లవారు జామున మృతి చెందగా అదే రాష్ట్రానికి చెందిన మరో కార్మికుడు లాల్సింగ్ పుర్తి చికిత్స పొందుతూ 25వ తేదీ రాత్రి మృతి చెందాడు.

అలాగే విజయనగరంకు చెందిన కెమిస్ట్ కె. సూర్యనారాయణ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 26న మృతి చెందాడు. ప్రస్తుతం జార్కండ్ రాష్ట్రానికి చెందిన ఒయాబన్ కోరాహ్ కూడా మృతి చెందడంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ నివేదికను బయటపెట్టాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు భద్రత ప్రమాణాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మాపరిశ్రమల్లో భద్రత ఆడిట్ నిర్వహించి ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS