SAKSHITHA NEWS

భారత రాజ్యాంగ రచయిత, అణగారిన వర్గాలలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తిప్రదాత, నిత్య సమరశీలి బాబాసాహెబ్ డా॥ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు అనగా 14-04-2023 శుక్రవారం ఉదయం 9 గంటలకు యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొంటారు.

కావున యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్)
యర్రగొండపాలెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

దొంత వెంకట్రావు గౌడ్
యర్రగొండపాలెం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి


SAKSHITHA NEWS