బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులుగా
నల్లమోతు మాధవరావు ఎన్నిక
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు గా నల్లమోతు మాధవరావు ఎన్నిక నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణం మన మోడీజీ అని తెలిపారు అదే సంకల్పంతో నాదెండ్ల మండల ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకు నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శివ నాగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటీ నాగేశ్వరరావు, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి వంశీ, పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్, పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పట్టణ మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఎడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షుడు కోటి, పట్టణ సెక్రెటరీ గుమ్మా బాలకృష్ణ, జనతా వారది కోమటి వాసు, బిజెపి సీనియర్ నాయకురాలు ఎలిజిబెత్ రాణి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
