అచ్యుతాపురం గుంటి పంచముఖి ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం
సాక్షిత వనపర్తి :
అమావాస్య పురస్కరించుకొని వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామం శివారులో వెలసిన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు ఆలయంలోని గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాల పూజలు నిర్వహించిన అనంతరం పంచముఖి ఆంజనేయ స్వామి మూర్తికి అభిషేకాలు భక్తుల ద్వారా నిర్వహించి స్వామివారిని పల్లకి సేవ , మంత్రపుష్పం, మహా మంగళ హారతి తో పాటు భక్తులకు ఆశీర్వాదం తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ పూజారి రమేష్ శర్మ మాట్లాడుతూ ప్రతినెల అమావాస్యకు స్వామివారికి ప్రత్యేక పూజలు కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగు తుందని తెలిపారు ఈఅమావాస్య సందర్భంగా దవాసు పల్లె గ్రామానికి చెందినభక్తులు వీణ సురేష్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో రమేష్ శర్మ పూజారి నవీన్ శర్మ గ్రామ సర్పంచ్ శాంతయ్య ఆశన్న నాయుడు దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ శివశంకర్ రెడ్డి డైరెక్టర్ డి కృష్ణయ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి బి.నీలయ్య అక్కల రవి గౌడ్ ఏం శేఖర్ కిట్టు గౌడ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల గ్రామాల భక్తులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
