అలుపు ఎరగని యోధుడు ప్రజలకే ఆయన జీవితం
సాక్షిత : చంద్రబాబు 76వ జన్మదినాన్ని ని ఘనంగా చేసిన పడుగుపాడు టిడిపి నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు పడుగుపాడు టిడిపి నాయకుడు దారపనేని శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తల రమేష్ అధ్యక్షతన కోవూరు పడుగుపాడు ముందుగా బైకులతో ర్యాలీ చేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు సి.యం సార్ అంటూ నినాదాలతో అనంతరం యన్ టిఆర్ నగర్లో కేక్ కటింగ్ చేసి అనంతరం 200 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేసి, ఘనంగా నిర్వహించిన పడుగుపాడు టిడిపి నాయకులు.
ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రజల మనిషి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్క వర్గాన్ని ముందుకు ఎలా తీసుకోవాలని ఆలోచనలతో ముందుంటారని ఆయన 76వ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ దైవ ఆశీస్సులతో వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలియజేశారు. ఈ టిడిపి సీనియర్ నాయకులు దారపనేని శ్రీనివాస్ నాయుడు, టిడిపి పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తల రమేష్, షేక్. నాసిర్, వావిళ్ళ భాస్కర్,కొండ తిరుపతి రెడ్డి, పటాన్ నజీర్, ఏక సిరి సుగుణమ్మ, అబ్బూరు శ్రీనివాసులు, పాలూరు బాలకృష్ణ,పచ్చ రాము, తిరువీధి శ్రీనివాసులు,మరియు పడుగుపాటు టిడిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY