SAKSHITHA NEWS

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక.

జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో ఎక్కువ మంది విద్యార్థులు కాటన్ సీడ్ పనులకు వెళ్తున్నారని, అటెండన్స్ శాతం పడిపోతున్నందున ప్రత్యేకంగా “డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ & చైల్డ్ లేబర్” టీమ్ లు ఏర్పాటు చేసి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక ఆధ్వర్యంలో డ్రాప్ ఔట్ పిల్లలను బడికి పంపాలని ZPHS ఆలూర్ పత్తి పొలాల్లో మండల అధికారులు పర్యటించి తల్లి దండ్రులకు పిల్లలను బడికి పంపాలని మోటివేషన్ చేసారు. అదే విధంగా ZPHS అలూర్ లో పేరెంట్స్ – టీచర్స్ సమావేశంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, తహసీల్దార్, MPDO, MEO పాల్గొని, పిల్లల భవిష్యత్తు కై కెరీర్ గైడెన్స్, మోటివేషన్ క్లాసెస్ నిర్వహించి, ఇటు తల్లి దండ్రులకు మరియు విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు. మరియు తదనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి , MPDO చెన్నయ్య, MEO నరసింహ, GHM నాగరాజు, నీతి అయోగ్ కో ఆర్డినేటర్ అఫ్జల్, DWO సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.

మరియు KT దొడ్డి మండలంలో ZPHS కొండాపూర్ లో 21 మంది డ్రాప్ ఔట్ స్టూడెంట్ ను గుర్తించి మోటివేషన్ చేసి, క్లాస్ లకు వచ్చే విధంగా చేసినట్లు MEO G సురేష్ తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినటర్ హంపయ్య, MNO వేష్కటేశ్వర్ రావు, Mphs HM మురళీధర్, ఉపాధ్యాయులు, MV Foundation వారు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS