SAKSHITHA NEWS

రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి..
-రాజానగరం ఎమ్మెల్యే బత్తుల

సాక్షిత రాజానగరం :
రాజానగరం నియోజకవర్గంలో ఎన్‌హెచ్ 16కి ఆనుకుని ఉన్న దివాన్‌చెరువు లో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలని ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ
అటవీ సంరక్షణాధికారి చిరంజీవ్ చౌదరి (ఐ.ఎఫ్.ఎస్) కు వినతి పత్రం అందజేశారు.
ఈ ప్రదేశం అటవీ ప్రాంతం కావడం వలన అనేక ప్రయోజనాలను అందిస్తుందని, దివాన్‌చెరువులో అందుబాటులో ఉన్న విశాలమైన స్థలం భవిష్యత్తులో విస్తరణకు అవకాశాలను అందిస్తుందన్నారు. ఇది అకాడమీ అభివృద్ధికి అనువైన ప్రదేశంగా మారుతుందని తెలియజేసారు. ఫారెస్ట్ అకాడమీని ప్రస్తుతం దివాన్‌చెరువులో ఉన్న స్థలంలో ఉంచవలసిందిగా కోరడం జరిగిందన్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలో జూ పార్క్ కూడా ఏర్పాటు చేయాలనీ కోరారు.


SAKSHITHA NEWS