SAKSHITHA NEWS

క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం అవసరం
రాజానగరం, సాక్షిత:
గైట్ డిగ్రీ కళాశాలలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం, ఎన్ఐపిఎం గోదావరి స్టూడెంట్ చాప్టర్ సంయుక్తంగా అతిధి ఉపన్యాసం క్విజ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాక్ సి రామిక్స్ హెచ్ఆర్ హెడ్ డాక్టర్ టి మనోజ్ కుమార్ మాట్లాడుతూ సోర్ ( soar)మరియు ( Hover) హోవర్ అనే పదాల గురించి వివరించారు. విలువలతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ ఆదా నిగ్రూప్ జిఎం హెచ్ ఆర్ ,డాక్టర్ శేషగిరిరావు, గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే వల్లి మాధవి, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ పి ఆర్ కె రాజు, గైట్ డిగ్రీ కళాశాల కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, బీకాం, బి బి ఏ అధ్యాపకులు ఏ హేమ సాయి లత, సిహెచ్ భార్గవి, ఏ. శ్రీనివాస్, బీకాం , బి బి ఏ, బి బి ఏ (డి ఎం) విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు ఎన్ఐపిఎం గోదావరి చాప్టర్ కాకినాడ వారు బహుమతులను అందజేశారు.


SAKSHITHA NEWS