SAKSHITHA NEWS

శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు & గ్రామ పెద్దలు


సాక్షిత :నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో కష్టాలు త్యాగాలు కోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర బంధం ఆజరామరమైనదని, సత్య ధర్మ పాలనకు, నేటి భావి తరాలకు ఆదర్శనీయుడని, శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను వేడుకున్నానని తెలిపారు.

కార్పొరేషన్ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ , కోలన్ తేజశ్రీ , సురేష్ రెడ్డి,మేకల వెంకటేష్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ నాయక్, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్, గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి దంపతులు, ప్రమీల సాయిలు యాదవ్ దంపతులు, కోలన్ శ్రీనివాస్ రెడ్డి , సరెందర్ రెడ్డి, రుక్కా రెడ్డి, నగేష్ చారీ, సీనియర్ నాయకులు కోలన్ శేఖర్ రెడ్డి , కోలన్ సునీల్ రెడ్డి, బాల వెంగయ్య చౌదరి,ఆవుల జగన్ యాదవ్ , ఆలయ కమిటీ సభ్యులు రాజ్ మోహన్ రెడ్డి,బైండ్ల నగేష్, నాగరాజ్ యాదవ్, టేకుల సుధాకర్ రెడ్డి, కోలన్ లక్ష్మణ్ రెడ్డి, ప్రవీణ్, తల్లారి సాయి, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మరియు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS