శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విభాగం అధ్యక్షులతో ఆత్మీయ సమావేశం

Spread the love

తాడేపల్లి లోని శ్రీ ఫార్ట్యూన్ గ్రాండ్ లో సిఎం జగనన్న ఆదేశాలమేరకు రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విభాగం అధ్యక్షులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య పాల్గొని మాట్లాడుతూ బాపట్ల జిల్లా లో వున్న నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే లు ఇన్ చార్జ్ ల సహకారంతో మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి దివ్యాంగుల కుటుంబాలను పలకరించి వారి సమస్యలు ఏమి వున్నా పరిష్కరించటానికి కృషిచేస్తామని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల కిరణ్ రాజ్ కి చల్లా రామయ్య గజమాలలతో దుశ్శాలువాలతో ఘనసన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల దివ్యాంగుల విభాగం అధ్యక్షులు,జిల్లాల ఇన్ చార్జ్ లు మరియు బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు గుంజి ఏడుకొండలు,లక్ష్మారెడ్డి, బొడ్డు శ్రీనివాసరావు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page