SAKSHITHA NEWS

రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల త్రిపురాంతకం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాగిజావ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు , కోట్ల సుబ్బారెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్నా విద్యార్ధుల కోరకు పౌష్టికాహారం అందించడం కొరకు ఉదయాన్నే విద్యార్థులకు రాగి జావ అండించడం చాలా గొప్ప కార్యక్రమము అని అన్నారు.

త్రిపురాంతకం మండలం స్పెషల్ ఆఫీసర్ DRDO-PD బాబురావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడం చాల సంతోషకరం అని ఆయన అన్నారు, ఎంపిడిఓ m. మరియదాస్ మాట్లాడుతూ జగనన్న గోరుముద్దు ఇప్పుడు మరింత పౌష్ఠికాహారంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండల k.విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ నాయక్ పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో రాగిజవా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అందరు విద్యార్థులు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల త్రిపురాంతకం ప్రధానోపాధ్యాయులు T.రాజశేఖర్ రెడ్డి , త్రిపురాంతకం సర్పంచ్ పోన్న వెంకటలక్ష్మి , వైస్ సర్పంచ్ ఆళ్ళ కృష్ణారెడ్డి , పేరెంట్స్ కమిటీ చైర్మన్ చిలుకూరి రామిరెడ్డి , త్రిపురాంతకం దేవస్థానం కమిటీ చైర్మన్ పద్మజ మల్లికార్జున , ఎంపీటీసీ సభ్యులు గొట్టిముక్కల రిబ్కా , ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS