SAKSHITHA NEWS

పేదలకు ఉపకరించేలా అధునాతన హంగుల ఫంక్షన్ హాల్స్ – డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, మార్చి 5 : సికింద్రాబాద్ లోని లాలాపేట ప్రాంతం వివిధ సదుపాయాలతో నగరంలోనే ప్రత్యేక గుర్తింపునకు నోచుకోనుందని, కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ వల్ల నిర్మాణం పేదలకు ప్రయోజనం కలుగుతుందని డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

లాలాపేట లో నిర్మిస్తున్న జీ హెచ్ ఎం సీ కొత్త ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను శ్రీ పద్మారావు గౌడ్ ఆదివారం తనిఖీ చేశారు. స్లాబ్ నిర్మిస్తున్న తీరుతెన్నులను పరిశీలించారు. రెందంతస్తులతో రూ.6.99 కోట్లతో నిర్మించే ఫంక్షన్ హాల్ లో వివిధ సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. అదే విధంగా లాలాపేట లో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న కొత్త స్విమ్మింగ్ పూల్ అంతర్జాతీయ ప్రమాణాల తో రూపు దిద్దుకోనుందని శ్రీ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు


SAKSHITHA NEWS